Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.30వేల నగదు అపహరణ
నవతెలంగాణ-వనస్థలిపురం
గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లో రూ.30వేలు నగదు చోరీ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైకోర్టు కాలనీకి చెందిన ప్రకాశ్ తన అవసరాల నిమిత్తం ఇంట్లో రూ.30వేల నగదు కలిగిన బ్యాగ్ను కిటికి సమీపంలో సోమవారం రాత్రి ఉంచాడు. మంగళవారం ఉదయం లేచి చూసే సరికి నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందనే విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.