Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
పాఠశాల నాయకత్వానికి సంబంధించి ఉత్తమమైన ఆచరణలు కేస్ స్టడీస్, నివేదికలను పాఠశాల నాయకత్వ అకాడమీ (ఎస్ఎల్ఏ)కు రాసి పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వెంకట నర్సమ్మ ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ 'పాఠశాల రూపాంతరీకరణ దిశలో ఉపాధ్యాయులు' (స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్) అనే అంశంపై ఉపాధాయులు, ఇతరుల కృషిని 2500 నుంచి 3000 పదాలకు మించకుండా పంపాలన్నారు. వీటిని ఎల్బీ స్టేడియం ఎదురుగా గల ఎస్సీఈఆర్టీ భవనంలోని పాఠశాల నాయకత్వ అకాడమికి ఈ నెల 31వ తేదీలోగా పంపాల న్నారు. పాఠశాల నాయకత్వ జాతీయ కేంద్రం - విద్యా ప్రణాళిక, పరిపాలన జాతీయ సంస్థ (న్యూ ఢిల్లీ) సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యా యులకు 'పాఠశాల నాయకత్వం- నిర్వహణ' పై ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. జనవరి 29 నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సు రెండున్నర నెలలు లేదా 10 వారాలు లేదా 30 గంటల పాటు ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు, ప్రవేశ రుసుము లేదన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు వివిధ బ్యాచ్లలో తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. పాఠశాల నాయకత్వ అకాడమీ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి విభాగాలు ఒకటిగా ఏర్పడినట్టు డీఈవో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో భిన్న యాజమాన్యాల క్రింద పనిచేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలోని 'ఉత్తమ నాయకత్వ విధానాల'ను గుర్తించడమే ఎస్ఎల్ఏ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. మరిన్ని వివరాలకు 94404 05244 నంబర్లో సంప్రదించాలన్నారు.