Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దర్ని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలో గంజాయి, టీవీఎస్ వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల మేరకు కాచిగూడకు చెందిన జీ.మణికంఠ అల్వాల్లోని ఓకాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సును చేస్తున్నాడు.
కాచిగూడకు చెందిన ఎండీ సోహెల్ అనే యువకుడు హిమాయత్నగర్లోని ఓ కాలేజీలో ఏవినేషన్ అకాడామీ కోర్సు చేస్తున్నాడు. కరీంనగర్కు చెందిన వీరు చదువు కోసం నగరానికొచ్చారు. గతేడాది స్నేహితులతో కలిసి వీరు టూర్కు ప్లాన్ చేసుకున్నారు. విశాఖపట్నం, అరకుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా గంజాయిని సేవించారు. అయితే నగరానికి వచ్చిన తర్వాత సైతం గంజాయి కోసం గాలించారు. ధూల్పేట్ ప్రాంతంలో ఓ వృద్ధుని వద్ద గంజాయి లభిస్తుందన్న సమాచారాన్ని సేకరించారు. అతనికి రూ.100 చెల్లించి 50 గ్రాముల గంజాయిని కోనుగోలు చేసి సేవించడం ప్రారంభించారు.
అలా గంజాయికి అలవాటు పడిన వీరు సరఫరా దారులుగా అవతారమెత్తారు. ట్రైన్లో ఆరుకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి అధిక ధరకు విక్రయించడం మొదలు పెట్టారు. ఇదిలావుండగా వారం రోజు క్రితం అరకుకు వెళ్లిన వీరు 2కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.
నగరానికి తీసుకొచ్చి రూమ్లో దాచేశారు. మూడో వ్యక్తి తెలియకుండా స్నేహితులకు, కావాల్సిన వారికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అమీర్పేట్లో ఓ వ్యక్తికి గంజాయిని విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించినట్టు డీసీపీ తెలిపారు.
చందానగర్
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటన చందానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ సీఐ రవీందర్రావు తెలిపిన వివరాల ప్రకారం..చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 3 కిలోల గంజాయి సంచులతో వెళ్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. బీదర్కు చెందిన అల్లావుద్దీన్(32) తండ్రి మోహినుద్దీన్, మహారాష్ట్రకు చెందిన సలీం ఇక్బాల్ ఖాజా (57) తండ్రి ఖాజ వత్తి ఆటో డ్రైవరు.్ల వీరు శేరిలింగంపల్లిలో ఉన్న పాపిరెడ్డి కాలనీలో నివసిస్తున్నారు. నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా నుంచి గంజాయి తీసుకొని వచ్చిన వీరిని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ.5000, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.