Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడ్డ ఇద్దరి వ్యక్తులకు ఏడు రోజులు జైలు శిక్ష విధించింది. వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజరు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11న హయత్నగర్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో హయత్నగర్కు చెందిన కృష్ణ, యాదయ్యలు మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడ్డారు. మంగళవారం హయత్నగర్ రెండో మెట్రోపాలిటన్ జడ్జి సంధ్యారాణి వారికి 7రోజులు జైలు శిక్ష విధించింది. వారిద్దరు డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడటం ఇది రెండో సారని తెలిపారు.