Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి
నవతెలంగాణ - వనస్థలిపురం
వనస్థలిపురం సోమనాథక్షేత్రంలో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు మృతిచెందిన ఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం మంగళవారం వైజాక్కు చెందిన శృతికీర్తి(80) అనే వృద్ధురాలు ఉదయం వనస్థలిపురంలోని సోమనాథక్షేత్రానికి వచ్చింది. క్షేత్రంలో ఉన్నటువంటి వంటగదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్ను వెలిగించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి పక్కన గదిలో ఉన్న మరో మహిళ లలితకు కిటికి అద్దాలు పగిలి గాయాలైన్నాయి. ఈ పరిణామంతో క్షేత్రంలోని భక్తులు భయంతో వంటగది వద్దకు చేరుకోగానే గాయాలతో ఉన్న ఆమెను ఎల్బీ నగర్లోని ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.