Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మీర్పేట్
యువతి అదృశ్యమైన ఘటన మీర్పేట్ పోలీస్స్టేషన్ మంగళవారం పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం బూతరాజు కృష్ణయ్య రాంచంద్రా అపార్ట్మెంట్, గాయత్రీనగర్లో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తు అక్కడే నివాసముంటున్నాడు. ఇతనికి కూతురు బూతరాజు మమత(22) ఆదివారం ఇంటి నుంచి ఉదయం 11 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు కూతురుకు ఫోన్ చేయగా స్నేహితుల దగ్గర ఉన్నా వస్తున్నా అని చెప్పింది. కానీ రాలేదు. దాంతో తన తండ్రి మంగళవారం పోలీసులకు కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.