Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బేగంపేట
దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సయ్యద్ శాహేజాద్ అలియాస్ రాకేష్ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే ఎస్పీ అశోక్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ టికెట్ బుకింగ్ వద్ద, ఎస్కలేటర్ ఎక్కుతున్న ప్రయాణికుల బ్యాగ్ల జిప్లను తొలగించి నగలు, ఆభరణాలు ఎత్తుకెళ్తున్నాడు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే రైల్వే పోలీసులు అతన్ని పట్టుకుని విచారించారు. అతని నుంచి 21తులాల బంగారం, నాలుగు తులాల వెండి, రూ.1లక్షా 6వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై జిప్ ఆపరేషన్, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ మొత్తం 11 కేసులున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించారు.