Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
నగరంలో అనుమానస్పదంగా ఉన్న మతిస్థిమితంలేని వ్యక్తిని గన్ఫౌండ్రి కార్పొరేటర్ మమతా గుప్తా చొరవతో అధికారులు మంగళవారం ఆశ్రమంలో చేర్పించారు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వ్యక్తిని గుర్తించిన కార్పొరేటర్ మమత జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని సిరాజుద్దీన్గా గుర్తించి, ఆసిఫ్నగర్ పామెన్గాప్ సంస్థ, పోలీసుల సహాకారంతో చౌటుప్పల్లోని అమ్మ-నాన్న ఆశ్రమానికి తరలించినట్టు జిల్లా వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బీపీ పుష్పలత తెలిపారు.