Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మేడ్చల్ కలెక్టరేట్
గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరేడ్ మార్చి పోస్ట్లు ముందుగానే రిహార్సల్ చేసుకుని, ట్రాఫిక్కు సెక్యూరిటీ వేసుకుని చూసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్ప అలంకరణ, షామియానా తదితర ఏర్పాట్లను చేయాలని ఈపీఆర్లను ఆదేశించారు. విద్యార్థులచే సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరుల కుటుంబాలను జిల్లాలోని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో విజయ కుమారి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలి: కలెక్టర్
ఇంటింటకీ వెళ్లి ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి ఈఆర్వోలను, ఏఈబీవీఆర్వోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఓటర్ జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్న విలువలకు మార్క్ లిస్టు టూల్ కిట్ రిజిస్టర్ గురించి అవగాహన లేదన్నారు. జిల్లాలో ఈనెల 25 వరకు స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నందున ఇంటింటికీ వెళ్లి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయడంతో పాటు తొలగించిన ఓటర్లను గుర్తించి వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, విజరు కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు