Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
భౌతిక శరీరానికి గాలి ఎంత అవసరమో.. మాససిన వికాసానికి, ఆత్మ సౌందర్యానికి కళలు అంతే ముఖ్యమని చినజీయర్ స్వామి అన్నారు. కళలను పోషించాల్సిన బాధ్యత సమాజానిదేనని వివరించారు. రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో లిటిల్ మ్యుజిషియన్ అకాడమీ నిర్వహణలో స్వరకర్త, గాయకుడు కొమాండూరి రామాచారి జన్మదిన వేడుకలు సంగీత భరితంగా మంగళవారం నిర్వహించారు. రామానుజ చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. తన మంగళా శాసనంలో దక్షిణాత్య సంగీతం, ఉత్తర భారతీయ సంగీతం సమ స్థాయిలో ఆలపించగలిగినవారు రామాచారి అని తెలిపారు. ఆయన అకాడమీకి తగిన స్థలం తొందరలోనే లభించగలదని ఆశీస్సులు అందించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రామాచారి వందల మందిని సంగీత కలువలుగా తీర్చిదిద్దారని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందినీ సిధారెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్లు తమ అభినందనలు తెలుపుతూ పద్మ పురస్కారాలు రాకపోయిన సంగీత పద్మాలుగా పిల్లలను తీర్చిదిద్ది సంస్కృతిని నిలబెడుతున్న రామాచారి అభినందనీయులన్నారు. సంచాలకుడు మామిడి హరికృష్ణ స్వాగతం పలికిన సభలో గురువులు పివి సాయిబాబా, ఓరుగంటి లీలావతి తమ శుభాశీష్యులు రామాచారికి అందించారు.