Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
బాలాపూర్ మండలంలోని బడంగ్పేట, జల్పల్లి, మీర్పేట, జిల్లెలగూడ మున్సిపాలిటీల్లో అనేక అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతుందని మాజీ సహకార సంఘం చైర్మన్ కొలన్ శంకర్రెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేటలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం, నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వెంచర్ యజమానులు అనుమతులు తీసుకోవాలన్నారు. కానీ మాజీ సర్పంచ్లు సృష్టించిన నకిలి దస్తావేజుల అనుమతులతో అనేక వెంచర్లు, ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు చూసిచుడనట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా చేస్తున్నారన్నారు. అక్రమ వెంచర్లతో ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్య ప్రజలకు మోసం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గతంలో ప్రజాప్రతినిధుగా ఉండి మృతి చెందిన వారి సంతకాలతో సైతం నకిలి డ్యాకుమెంట్లను తయారుచేసి ప్లాట్లకు అనుమతులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ వెంచర్లపై న్యాయ విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్రచారి, మధుసూదన్రెడ్డి, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.