Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం రూ.81.53 కోట్ల నిధులు మంజూరు
- చెక్కును అందుకున్న కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్
నవతెలంగాణ-వనస్థలిపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్దౌలా బస్తీ తరలింపునకు కేంద్ర ప్రభుత్వం రూ.81.53 కోట్లు నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్ అన్నారు. కాంచన్బాగ్లోని డీఆర్డీఎల్ సైంటిస్ట్ జీ డైరెక్టర్, మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రతినిధి డీ.ఆర్.ఎస్.ఎస్. పన్వార్, డీఆర్డీఎల్ డైరెక్టర్ భాస్కర్రెడ్డి, అడ్మిన్స్ట్రేటర్ అధికారి చమన్సింగ్రాణా సమక్షంలో కార్పొరేటర్ ఈ చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ నిధుల మంజూరుకు ఎమ్మెల్యే సిహెచ్.మల్లారెడ్డి ఎంపీగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రులు అరుణ్జైట్లి, నిర్మల సీతారామన్ను కలిసి బస్తీ తరలింపునకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఎక్కువ శాతం పేదలు ఉన్న ఈ బస్తీలో కూలీ, నాలి చేసుకొని జీవించేవారికి ఈ నిధులు ఎంతో ఉపయోగక రమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మల్లోజు రవి, లక్ష్మయ్య, పెంటయ్య, జగన్, డేవిడ్, తిరుపతయ్య, కాటేపాక లక్ష్మయ్య పాల్గొన్నారు.