Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్ఫూర్తి కళాశాల సెక్రెటరీ జగన్ మోహన్రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట
సాంకేతిక ఆవిష్కరణలతో విద్యార్థుల్లో దాగి ఉన్న మేధస్సును వెలికి తీయొచ్చని స్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల సెక్రెటర్ ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో పల్లె సృజన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామీణ సాంకేతిక ఆవిష్కరణ ప్రదర్శనను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రైతుల కోసం తయారు చేసిన ఆవిష్కరణలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. రైతుల కోసం ఉపయోగపడే యంత్రాలను తయారు చేస్తే వారి పని ఎంతో సులభతరమవుతుందన్నారు. విద్యార్థులు రైతుల కోసం అధునాతనమైన యంత్రాలు తయారు చేసి వారికి తక్కువ ధరకే అందించే కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామ్ప్రసాద్, ప్రిన్సిపాల్ కే.ఎస్.సాజీ, హెడ్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఆర్.అశోక్కుమార్, పల్లె సృజన వ్యవస్థాపకుడు గణేశం పాల్గొన్నారు.