Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వృత్తులన్నీ కనుమరుగవుతున్నాయి
భూగోళమంతా రోడ్డు మీద పండుకుంది
నెత్తిన దీపపు కుంపటి పెట్టుకుని
చరిత్రను భుజాలకేస్కొని - రూపాలతో కూసాలు విడుస్తూ
రుతువుల చుట్టూ తిరుగుతూ
'కీ'నీడనై ఉన్నా
రేపటి సూర్యోదయం కోసం!!
విశ్వకర్మ వృత్తి కవిత్వం అన్నారు. కానీ సబ్బండ వర్ణాల కన్నీళ్లను కవిత్వీకరించారు కృష్ణమాచారి ఈ కవితా సంపుటిలో..
'దివిటీలో పుట్టిన వాళ్లే కదా
చీకటిని పాలదోలిన వాళ్లు
సవురం చేసినోళ్లే కదా
నాగరికుల చేసినోళ్లు
జకముక రాయి జమ్మిదూదితో
నిప్పుకు ఆజ్యం పోసినవాళ్లే కదా
కొలిమి రాజేసినోళ్లు
కండలను కంకరాళ్లు చేసి
కాశ పోసిన చెమటవే కదా
ఆ ప్రాజెక్టులు - ఈ తారురోడ్లు' అంటారు. 'పంచమ సోదరుల్లారా'
అనే కవితలో!
అలాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంతాచారి విధానాన్ని 'మండిన శిల' కవితలో కదిలించే వాక్యాలు కన్నీళ్లు తెప్పించడమే కాక ఆలోచింపజేస్తాయి.
'మండింది నా ఒళ్లు కాదు
నాలుగు కోట్ల కడుపులు
మా వాకిట మట్టి ముద్దలునయి
రేపటి తరాల వృక్షాల కోసం
నీటిలో బిందువునయి
గాలిలో కలిసి నా ఊపిరితో
ప్రపంచమంతా తిరిగి ఉద్యమంగా పోగుచేసుకొస్తున్నా
రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమాన్నై బతికే ఉంటా'
అనే ఉద్యమ ఆకాంక్షని! త్యాగమయ బలిదానాన్ని నివాళిగా అక్షరీకరించిన తీరు ప్రశంసనీయం.
విద్యుత్ పోరాటమైనా.. ముదిగొండ భూపోరాటంలోనైనా
రాజ్య హింసకు బలైంది అణగారిన పీడిత పేద ప్రజలే!
'నేలంతా రక్తం పులుమతుండ్రు
విద్రోహం అంతా గాపైన కూసునోళ్లదే
ఆ రాబందులదే, కోడెనాగులదే
మౌనానికి ఎపుడో ఒక 'మారోజు' ఉదయిస్తుంది
ఆ రోజు హతారాలు నాట్య మాడుతాయి' అంటూ కవి చాలా శక్తిమంతమైన పదాల పోహళింపు గమనించగలం.
'రుంజ మోగుతునే ఉన్నది
అనాది కథ కాళ్లకు అడ్డంగా తిరిగింది
అది రుంజా? కడుపుల కాలే మోతా?
మర్రి ఊడల్ని విస్తరించినట్లు రుంజ మోతా
మేఘాలను వసంతంలోకి మారుస్తున్నది
రైతును రోజు కూలీలుగా మార్చివేశాయి
గణతన ఆర్థిక - సరళీకరణ విధానాలు..
'అడ్డాల కూలీలు' కవితలో చివరి వాక్యాలు పాఠకున్ని కదిలిస్తాయి.
'నేల మీద పచ్చని గడ్డిపరకై
మణికట్టు మడిసి
సెజ్ లెవరి కోసం
సేతు లెవరి కోసం
ఇరుసై తిర్గిన మా వూరి పనోళ్లు
పట్నంల అడ్డాల కూలీలు
'పల్లె కన్నీరు పెడుతోంది కనిపించని కుట్రల' అన్న గోరెటి వెంకన్న పాట గుర్తుకొసుంది పై కవిత చూస్తే
కుడి చెయ్యి విరిగింది సుత్తె పట్టకుండా
కుడి కాలు విరిగింది బాడిస కదలకుండా
దు:ఖంతోటి నీళ్లు తాగుతున్నాం' అంటారు కవి 'లాంతరు' కవితలో
ఈ వాక్యాలు మనస్సు ఉన్న వాఇన్ని కంటతడి పెట్టిస్తాయి. కన్నీళ్లను కవిత్వీకరించడం కృష్ణమాచారి కలల సొంతంమంటాడా కవి ఓ దీర్ఘ కవిత.. ఈ సంపుటికే హైలెట్గా నిలిచింది.
ఆ కవి, లోహం, కర్ర, మట్టి, రాయి, ఆరాటం
జీవరాసుల కాన్నుంచి
పోరాటం నేర్చుకుని అడుగెయ్యాలి
పోరాటం సచ్చు జీవితాలను
మెరుగెయ్యాలి
ఒక్క మనమే కాదు
మన సుట్టూ సెమటకార్చిన బతుకుల మధ్య
అతుకేసి నడవాలి అంటూ
పోరాట పంథాని అక్షరంలో పలికించిన ఈ కవి ఓ సామాజిక ఉద్యమ శాస్త్రవేత్త. సకల చేతి వృత్తుల వాన్ని ఉద్యమకారులుగా మలిచే పాఠ్యాంశం ఈ కవితా సంపుటి. కవి కృష్ణమాచారికి ఉద్యమకై మోడ్పులు..