Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవి దాసోజు కృష్ణమాచారి
నవతెలంగాణ - హైదరాబాద్
కవి ఈ కవితా సంపుటిని తన తండ్రి దాసోజు వెంకటాచారికి అంకితం చేశారు. డాక్టర్ కొలకలూరి ఇనాక్, నగముని విలువైన ముందు మాటలు రాశారు. ఫ్యూడల్, ఆధిపత్య శక్తులు ఉత్పత్తి వృత్తుల ఉనికిని మన కాళ్ల కింది నేలలోకి అదే పనిగా లాగేసుకుంటుంది. అందుకే పాత వ్యవస్థను రద్దు చేయాల్సిందే అంటారు ఈ కవి. కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాద శక్తులు పెరుగుదల ప్రమాదకరం అనే వర్గ స్పృహ కలిగిన కృష్ణమాచారి కలంలోంచి జ్వలించే అక్షర రవ్వలు కొన్నింటిని చూద్దాం! ప్రముఖ కవుల్లో ఒక్కరైన నగముని తన ముందు మాటలో చెప్పినట్టు 'చరిత్రను జల్లెడ పడితే - అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ దరిద్రులుగా మిగిలిన వారు, దరిద్రులుగా చేయబడిన వారు చేతి వృత్తులవారే! చరిత్రలో స్థానం లేని వారు' నిజానికి మొత్తం సమాజ అస్థిత్వాన్ని మోస్తున్నది చేతి వృత్తులవారే.. ఇది నిజమే కదా! 'కీ నీడ' కవితలో ఇలా అంటారు.