Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముషీరాబాద్
రూ. లక్షల ఫీజులు, డొనేషన్లు తీసుకుంటున్న కళాశాలలు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగి వి.నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ద కళాశాలల యాజమాన్యాలు స్పందించాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టాడు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ... తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పిల్లలను చదివిస్తున్నారన్నారు. చదువు పూర్తి కాగానే కళాశాల యాజమాన్యం విద్యా ర్థులకు సర్టిఫికెెట్లు ఇచ్చి బయటకు పంపుతున్నారని అన్నారు. రూ.లక్షలు వెచ్చించి చదువుకున్న విద్యార్థులు బయట ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కళాశాలల విధానంలో మార్పు రావాలని కోరారు. కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ దీక్ష చేపట్టినట్టి తెలిపారు.