Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అంబర్పేట
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం నారా యణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడి సిన్ (ఐపిఎం) ప్రాంగణంలో మెడికల్ ల్యాబ్ టెక్ని షియన్ కాలేజ్ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీ లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కాలేజీ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తుదని తెలిపారు.
ఐపిఎం డైరెక్టర్ కె.శంకర్ మాట్లా డుతూ... క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని చెప్పా రు. ఉన్నత శిఖరాలకు చేరుకో వాలంటే కృషి, పట్టు దల, ఏకాగ్రత ఉండాలన్నారు. గణతంత్ర దినోత్స వాన్ని పురస్కరించుకుని విద్యా ర్థులకు వాలీబాల్, క్యారమ్స్, చెస్, షెటిల్, టెన్ని కాయిట్ తదితర క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్య క్రమంలో ఎంఎల్టీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శివలీల, బిటిఎన్జీవోస్ అధ్యక్షులు సత్య నారాయణగౌడ్, కార్యదర్శి బలరాం, ఎం. శ్రీనివాసరావు, పద్మశ్రీ, రమేష్ పాల్గొన్నారు.