Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అడిక్మెట్
పంచాయతీరాజ్ రిజర్వేషన్పై బీసీ నాయకులు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్లో నిర్వహించిన బీసీ నాయకుల అత్యవసర సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 1993లో మండల్ కేసు సందర్భంగా ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 50 శాతం రిజర్వేషన్ పరిమితి విధించిందని గుర్తుచేశారు. ఈ గరిష్ట పరిమితిని ఎత్తేయాలంటే 11 మంది జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ సీలింగ్ తొలగించాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్ నిర్ణయించడంతో గరిష్ట పరిమితి నిబంధన తొలగిపోయిందన్నారు. ఈ సమావేశానికి బీసీ జాతీయ ఉప అధ్యక్షుడు గుజ్జ కష్ణ, నాగుల శ్రీనివాస్, సురేష్, కష్ణ, అంజి, మహేందర్గౌడ్, జైపాల్ పాల్గొన్నారు.