Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుకు గదుల్లో.. ప్రజాపాలన
- కూల్చివేతకు సిద్ధంగా ఉన్నా...శాఖల కార్యాలయాలు కొనసాగింపు
- స్థలం సరిపోక ఫైళ్లన్నీ నేలపైనే
- భయం గుప్పిట్లో ఉద్యోగులు
ప్రజావసరాలే పరమావధి కావాల్సిన ప్రభుత్వ కార్యాల యాలు, ఆ వాతావరణానికి దూరం అవుతున్నాయి. ఒక్క కలం పోటుతో జిల్లా యంత్రాగాన్నే కంట్రోల్ చేయ గలిగే కలెక్టరేట్ భవనం ఇరుకైన గదుల్లో కాలం దీస్తోంది. సమస్యలు చెప్పుకోడానికొచ్చే వారు కనీసం నిలబడడానికి కూడా జాగా లేని దుస్థితి. సెక్షన్ల అధికారులు, సిబ్బంది తమ ఫైళ్లను ఎక్కడ భద్రపర్చాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడు తున్నారు. శిథిలావస్థ జాబితాలో కలెక్టరేట్ భవనం ఉందన్న సంగతి జీహెచ్ఎంసీ చెప్పినా... పలు శాఖల కార్యాలయాలు కొనసాగుతూనే ఉన్నాయి.
నవతెలంగాణ - సిటీబ్యూరో
ప్రజావసరాలే పరమావధి కావా ల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, ఆ వాతా వరణానికి దూరం అవుతున్నాయి. ఒక్క కలం పోటుతో జిల్లా యంత్రాగాన్నే కంట్రోల్ చేయగలగే కలెక్టరేట్ భవనం ఇరుకైన గదుల్లో కాలం దీస్తోంది. సమ స్యలు చెప్పుకోడానికొచ్చే వారు కనీసం నిలబడడానికి కూడా జాగా లేని దుస్థితి. సెక్షన్ల అధికారులు, సిబ్బంది తమ ఫైళ్లను ఎక్కడ భద్రపర్చాలో తెలియని అయోమ యంలో కొట్టుమిట్టాడుతు న్నారు. శిథిలా వస్థ జాబితాలో కలెక్టరేట్ భవనం ఉంద న్న సంగతి జీహెచ్ఎంసీ చెప్పినా... పలు శాఖల కార్యాలయాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కలెక్టరేట్కు కొత్త భవనం దశా బ్దానికి పైబడి కలగానే మిగులుతోంది. సుమారు. 15 ఏండ్ల క్రితమే నూతన కలెక్టరేట్కు ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపినా, నేటికీ శిథిలావస్థ భవనం లోనే కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ విడుదల చేసిన శిథిలావస్థ భవనాల జాబితాలో కలెక్టరేట్ కూడా ఒకటి. సాధారణంగానే ఈ తరహా భవనాలను జీహెచ్ఎంసీ కూల్చివేస్తోంది. ఈ భవనంలోని కార్యాలయాలకు ప్రత్యామ్నాయం లేకపోవడం, అందులో కలెక్టరేట్ కావడం చేత జీహెచ్ఎంసీ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఫలితంగా నేటికీ ఈ భవనంలోనే ల్యాండ్ అక్విజేషన్, యువజన సర్వీసులు, మహిళా, శిశు సంక్షేమం, వయోజన విద్యా, డీవీసీ, ఐ అండ్ పీఆర్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.
పెచ్చులూడి పోవడంతో ఖాళీ...!
డీపీఆర్వో కార్యాలయం ఏడేండ్ల క్రితం ఇక్కడే ఉండేది. ఈ కార్యాలయంలో 2013లో స్లాబ్ పైభాగం నుంచి పెచ్చులూడి కంప్యూటర్లపై పడ్డాయి. ఈ సంఘటనతో కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు. వెంటనే డీపీఆర్వో కార్యాలయాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి మార్చారు. ఈ సమయంలోనే గ్రౌండ్ ఫ్లోర్లో కొనసాగిన ఎస్బీహెచ్ కలెక్టరేట్ బ్రాంచ్ను ఖాళీ చేసింది. ఇంత జరిగినా.. మహిళా శిశుసంక్షేమ, వయోజన విద్య, డీవీసీ కార్యాలయాలు పాత భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ భవనానికి ఆనుకొని ఉన్న మరో పాత భవనంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఆరోగ్య శ్రీ కార్యాలయాలు ఉన్నాయి. ఏండ్లు గడిచినా, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపనందున ఆయా శాఖల ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూనే విధులకు హాజరవుతున్నారు.
పాత చింతకాయలా కలెక్టరేట్ మార్పు...
పాత భవనానికి వెనుకాలే కలెక్టర్, జేసీ, డీఆర్వో, ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల కార్యాలయం ఉంది. ఈ భవనంలో ఆ అధికారుల పర్యవేక్షణలో 10 విభా గాలు పనిచేస్తాయి. ఒక్కో విభాగానికి తహసీల్దార్ క్యాడర్లో ఇన్చార్జీలు, సిబ్బంది, కంప్యూటర్లు, ప్రింట ర్లు, ఫైళ్లు, తదితర సామాగ్రి అంతా సర్థుకోవాల్సి ఉంది. కానీ, వీరికి అగ్గిపెట్టె లాంటి క్యాబిన్లు మాత్రమే ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలపై వచ్చిన వారు కనీసం కూర్చోడానికి కూడా స్థలం లేదు. రికార్డులు భద్రపర్చే గదిలో పాత ఫైళ్లకు స్థలం సరిపోవడం లేదంటూ, ఆ విభాగం సిబ్బంది కలెక్టర్కు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఆవిర్భావం అనంతరం లక్ష్డీకపూల్లోని రంగారెడ్డి కలెక్టరేట్, ఆ జిల్లా పరిధిలోకి మారుతున్నట్టు సమాచారం. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టరేట్ భవనంలోకి హైదరాబాద్ కలెక్టరేట్ మాబోతున్నట్టు మూడేండ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా, ఆ భవనం అటు పోవట్లే.. ఈ భవనం ఇటు మారట్లే. ఎలాంటి ప్రమాదం జరగకముందే ఉన్నత అధికారులు మేల్కొని శిథిలావస్థ భవనాన్ని కూల్చివేసి, హైదరాబాద్కు కొత్త కలెక్టరేట్ను నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.