Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
ఘంటసాల యువకళ కేంద్రం ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికపై గురువారం ఎంఎస్విఎన్ వంశీ కృష్ణదేవరాయలు సంగీత సారథ్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఉమా రామగోపాల్, చందన, సప్తగిరి ప్రసాద్, శ్రీధర్, వోబుల పతి, జయశీర్, సోనిలు కృష్ణదేవరాయలతో కలిసి మధురంగా గానం చేశారు. ఘంటసాల గానసభ అధ్యక్షులు డాక్టర్ కెవి.రావు, ప్రముఖ గాయకుడు త్రినాథరావు, గాయని అఖిల తదితరులు పాల్గొన్న సభలో కృష్ణదేవరాయలను సత్కరించారు.