Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చాధర్ఘాట్
మోడీ, బీజేపీ అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. పీడీఎస్యూ ఈస్ట్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో 'చల్లో ఢిల్లీ' వాల్పోస్టర్ను ముసారాంబాగ్లో నాయకులు ఆవిష్కరించారు. నాయకులు వి.రియాజ్ మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలు తేడా లేకుండా సమానత్వం, సామాజిక న్యాయం విద్యారంగంలో అందరికీ కల్పించాలన్నారు. ప్రభుత్వ విశ్వ విద్యాలయాలను కాపాడుకోవాలని, ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్శులు సైదులు, నవీన్, సహాయ కార్యదర్శి శ్రీను, నాయకులు రవి, శ్రీకాంత్, లోకేష్, రాజశేఖర్, ల×, మహేష్ తదితరులు పాల్గొన్నారు.