Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ అకాడమీ డైరెక్టర్ సతీష్
నవతెలంగాణ - చాధర్ఘాట్
ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం అందించాలని శ్రీ అకాడమీ డైరెక్టర్ సతీష్ తెలిపారు. గురువారం స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధ్వర్యంలో రోడ్లపై నిద్రిస్తున్న పేదలకు, ఆస్పత్రికి వచ్చి అవస్థలు పడుతున్న 300మందికి అన్నం ప్యాకెట్లను దిల్సుఖ్నగర్ శ్రీ అకాడమీ డైరెక్టర్లు సతీష్, ఫణీలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ చేసే ప్రతి పనీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఫౌండేషన్ కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఎడ్యూకేషన్ పరంగా ఎలాంటి సహయం అయినా చేస్తామన్నారు. కార్యక్రమంలో స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్, తెలంగాణ హోంగార్డ్స్, జాయింట్ సెక్రెటరీ అబ్రహం, కిర్చీ కంపెనీ ప్రెసిడెంట్ హరీష్, శ్రీ అకాడమీ సిబ్బంది నితీష్, పౌల్రాజ్, ఇజ్రాయేల్, పవన్ గోరకంటి, రత్నంమాదిగ, నవీన్, నయీమ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.