Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్బీనగర్: నిరుపేదలకు సహాయం చేయాలనే, వారి కోసమే ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చైతన్యపురి పండ్ల మార్కెట్, ఎన్టీఆర్ నగర్ మార్కెట్, వనస్థలిపురం రైతుబజార్, ఎల్బీనగర్ చౌరస్తా, బైరామల్గూడ చౌరస్తాల్లో నిర్వహించారు. మొత్తం 1200 ఆహార పొట్లాలు వివిధ హోటళ్లు(వనస్థలిపురం స్వాగత్ గ్రాండ్, బావార్చి, సురభి, సంగీత్ గ్రాండ్, ఎన్ విలేజ్, శ్రీ చందన, పారడైస్, క్రితుంగ మరియు చట్నీస్) సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు విజయకష్ణ, విజయ భాస్కర్, కార్పొరేటర్ శ్రీరమణా రెడ్డి, ఏఎంహెచ్వో మల్లికార్జున రావు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.