Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ధూల్పేట్
కిషన్బాగ్ మున్సిపల్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన 'ఫీడ్ ద నీడ్' కార్యక్రమాన్ని కిషన్బాగ్ కార్పొరేటర్ గఫార్, సర్కిల్-10 ఏఎంహెచ్వో డాక్టర్ డీవీఎస్ ప్రసాద్ ప్రారభించారు. లేబర్ అడ్డా, ఆటో స్టాండ్, ఆయా ప్రాంతాల పేద ప్రజలకు అన్నం ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు సహయ సహకారాలు అందించడంతో ఎంతో మందికి మేలు కల్గుతుందన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులకు తమ సహకారం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.