Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజేంద్రనగర్
ఉప్పర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను అతి త్వరలో పరిష్కారిస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు. గురువారం రాజేంద్రనగర్ మండల విద్యాధికారితో కలిసి ఆయన ఉప్పర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ, ఆటస్థలం కావాలని కోరారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంఈవో వెంకటయ్యను అదేశించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీలత, మహేష్, విజయ తదితరులు పాల్గొన్నారు.