Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దుండిగల్
బాచుపల్లి మండలం, ప్రగతీనగర్ పరిధిలోని వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిచిన 11వ ఆలిండియా ఓపెన్ ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీయేట్ స్పోర్ట్స్ ఫెస్ట్ గురువారం ముగిసింది. కళాశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సిడి.నాయుడు ముగింపు ఉత్సవాల్లో పాల్గొని విజేతలను అభినందించి మాట్లాడారు. ఆటల పోటీలలో పాల్గొని విద్యార్థులు అత్యున్నత స్ధాయి ఉత్సవాన్ని ప్రదర్శించారని చెప్పారు. కళాశాల విద్యార్థులను భవిష్యత్లో జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్ది ప్రోత్సహిస్తామని తెలిపారు. వివిధ కళాశాలల యాజమాన్యాలకు ఆయన ధన్యవాదాలు తెలిపి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ బి.చెన్నకేశవరావు, ఫిజికల్ డైరెక్టర్ జి శ్రీరామ, జెపి మూర్గన్ చేజ్, ఆల్మెంట్ అక్యూజేషన్ టీమ్ సభ్యులు ఫరమ్ వీర్ పాల్గొన్నారు.