Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
మహిళల స్వయం సంవృద్ధి సాధిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో గురువారం పొదుపు మహిళా పొదుపు సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. మహిళా పొదుపు సంఘాలకు యూసీడీ ద్వారా మంజూరైన రుణ పత్రాలు ఎమ్మెల్యే వారికి అందజేశారు. మహిళల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తుందన్నారు. ప్రభుత్వం మహిళా గ్రూపులకు బ్యాంకుల ద్వారా అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి మహిళా స్వశక్తితో నిలదొక్కు కోవడానికి ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. కుటుంబంలోని మహిళలు విజ్ఞానవంతులై వుంటే ఆ కుటుంబం అంతా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని, క్రమ శిక్షణతో కూడిన జీవనం సాగిస్తారని తెలిపారు. స్వశక్తితో మహిళా గ్రూపుసభ్యులు ఆదర్శవంతగా ఎదగాలని, ఇతరులకు స్పూర్తిగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు విజరు కుమార్, విక్టర్, పీవో సంధ్య, హరిప్రియ, కార్పొరేటర్ రావుల శేషగిరి, 108వ డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, టీసీఎఫ్లు విజయలకిë, సంధ్య, ఆషీయా తదితరులు పాల్గొన్నారు.