Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్: విద్యాభారతి బృందం సామూహిక సంకీర్తన గానం శ్రోతలను ఆకట్టుకుంది. శ్రీత్యాగరాయ గానసభలోని కళాదీక్షితులు కళావేదికపై మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతి బండి ఆయత చండీ పేదలకు లక్ష కిలోల బియ్యం పంపిణీలో భాగంగా గురువారం భక్తి సంగీత గానగోష్టి నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం స్థాపకుడు శ్రీనివాస్, పారిశ్రామికవేత్త ఎన్.రమాదేవి, దైవజ్ఞ శర్మ, బి.శ్రీనివాస్, లయన్ కెవిఎస్ స్వరాజ్య లక్ష్మీ, బ్రహ్మాణ సంఘ ప్రతినిధి సూర్యప్రకాశ్, ఆదర్శ ఫౌండేషన్ భోగరాజు పాల్గొని విద్యాభారతిని సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు మోహన్ కుమార్ మాట్లాడుతూ తమ లక్ష్యం లక్ష కిలోల బియ్యం పంపిణీలో భాగంగా నేడు 200 కిలోల బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు.