Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్టార్టప్ లీడర్ షిప్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఈ నెల 17న మారథాన్ 'ఎస్ఎల్పీ 5 కె రన్' నిర్వహిస్తున్నట్టు గ్రాన్యూల్స్ ఇండియా డైరెక్టర్ చిగురుపాటి ఉమా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ అమారీస్ ఫర్ డీప్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ మద్ధతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ చౌరస్తాలో ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వ్యాపారవేత్తలు, అత్యుత్తమ వ్యవస్థాపకులు, నూతన ఆవిష్కర్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.