Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
అల్లాపూర్ డివిజన్ పర్వతనగర్లో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ సబిహ గౌసుద్దిన్ పరిశీలించారు. పర్వతనగర్ శ్మశాన వాటిక నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు రూ.8 లక్షల వ్యయంతో రోడ్డు వేస్తున్నారు. గురువారం ఆమె కాలనీవాసులతో కలిసి పనులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో కాలనీవాసులు బాబా, సుంకన్న, విష్ణు, కళ్యాణ్ నాయక్, రాజు, శ్రీను, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.