Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
50 ఏండ్ల కాలంలో ఏ నాయకుడు , పార్టీలు చేపట్టని ఎన్నో పనులను కేవలం ఐదేండ్ల కాలంలోనే తమ ప్రభుత్వం చేపట్టిందని, రానున్న రోజుల్లో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని టీఆర్ఎస్ ఎమ్మెల్చే టి. పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని అన్నానగర్ ప్రాంతంలో నాలాపై రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన కల్వర్ట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచినా నాలుగేండ్ల వ్యవధిలోనే అన్ని ప్రధాన కల్వర్టుల పునర్నిర్మాణం చేశామని ఆయన వివరించారు. లాలాపేటలో ఏకంగా 50 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను రూ.3.50 కోట్ల నిధులు వెచ్చించి కల్వర్టును విస్తరించమన్నారు. 6 కల్వర్టులను రూ.7.25 కోట్ల ఖర్చుతో విస్తరించి ప్రజావసరాలకు అనుగుణంగా వివిధ పనులను చేపదుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, జీహెచ్ఎంసీ ఈఈ ఇందిరా బాయి, అధికారులు, స్థానిక నేతలు, అన్నా నగర్ బస్తీ సంఘం నేతలు పాల్గొన్నారు.