Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 63/1లో ఏలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను మండల రెవెన్యూ అధికారులు గురువారం కూల్చి వేశారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి శ్రీనివాస్ గౌడ్ అదేశాల మేరకు నిర్మాణాలను కూల్చి వేశామని బోడుప్పల్ తహసీల్దార్ కిషోర్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సార్లు ఈ ప్రాంతంలోని ప్రజలను ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ణప్తి చేశామని, అయితే కొంత మంది దళారులు పేద ప్రజలను మోసం చేస్తూ, ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని వారు తెలిపారు. మరోసారి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.