Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
అడ్డగుట్ట డివిజన్ పరిధిలో నెలకొన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి, కార్పొరేటర్ విజయకుమారి గురువారం వాటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్ కలిసి చర్చించారు. డివిజన్లోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పద్మారావు కాలనీ పర్యటలో భాగంగా రూ.40 లక్షల మంజూరు చేశారని తెలిపారు. డివిజన్లోని అడ్డగుట్ట ఏ బీ సీ సెక్షన్ల ప్రకారం తుకారాంగేట్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని జీఎంకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు హంసరాజు, సత్తయ్య, మనోహర్, వసంత తదితరులు పాల్గొన్నారు.