Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
చీర్యాల గ్రామంలోని మల్లన్నగుడి ఆవరణలో రూ.3 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ తుంగ ధర్మేందర్, ఉపసర్పంచ్ జిల్లా తిరుమల్రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చీర్యాల గ్రామాభివృద్ధికోసం పంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషిచేస్తుందని ఆయన పేర్కోన్నారు. గ్రామంలో దశల వారీగా ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కురం సంగీత, వార్డుసభ్యులు రామిడి రాంరెడ్డి, కోల మహంకాళి, బర్లపాటి ఆంజనేయులు, శివలింగాల గౌరిశంకర్, కోల మాధవి, సింగిరెడ్డి ప్రజ్వల, డొంకని షాలిని, మంకిరాజు, కోల అశోక్ యాదవ్, కోల క్రిష్ణ యాదవ్, చిందం నగేష్, ఏలూరి సత్యనారాయణ, కోల నర్సింహ్మ యాదవ్ ,పోట్ట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.