Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ అధికారిణి బి.వెంకటనర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 27వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల దాకా జరుగుతాయని అన్నారు. సరిగ్గా నెల రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ... ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమయంలో కఠినంగా ప్రధానోపాధ్యాయులు, అబ్జర్వర్లను పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ పరీక్షలకు ఉదయం 8 గంటల లోపు పరీక్షా పత్రాలను తెరవకూడదని, ముందుగా నియామకం చేసిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమక్షంలోనే పరీక్షా పత్రాలను ఓపెన్ చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు కశ్చితంగా ఈ టైం టేబుల్ను పాటించాలన్నారు. పరీక్ష ముగిసిన పిదప సాయంత్రం మరుసటి రోజు పరీక్షకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చాలని, పరీక్షల పట్ల మరింత అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ నెల 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2, 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీషు పేపర్ -1, 20న ఇంగ్లీషు పేపర్ -2, 21న గణితం పేపర్ -1, 22న గణితం పేపర్ -2, 23న జనరల్ సైన్స్ పేపర్-1, 25న జనరల్ సైన్స్ -2, 26న సోషల్ స్టడీస్ పేపర్ -1, సోషల్ స్టడీస్ పేపర్ -2 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డీఈవో వెంకటనర్సమ్మ వివరించారు.