Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిధిలోని వాణిజ్యసముదాయాలల్లో తప్పని సరిగా అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాల ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జీహెచ ్ఎంసీ కమిషనర్ దానకిషోర్కు ఆదేశాలు జారీ చేశారు. జీ హెచ్ఎంసీ పరిధిలోని రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, హాస్టల్స్ ఆస్పత్రులు, పాఠశాలలు, మందిరాల తోపాటు వివిధ వాణిజ్యసముదాయాలల్లో తప్పని సరిగా ఫైర్ అండ్ సెఫ్టీ చర్యలు తీసుకోవాల్సిన అవరసముందన్నారు. అగ్నిప్రమా దాల నివారణ కోసం ప్రత్యేక పరికరాలతోపాటు, కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు కావాల్సిన జాగ్రత్తలు నెలరోజుల్లో తీసుకోవాలన్నారు. వాణిజ్యసముదాయాలల్లో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీని ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్ణక్ష్యం వహించిన నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.