Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెండు వారాల క్రితం మహబూబ్ అలీ అనే యువకుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఒక ట్వీట్ చేశాడు. ''కేటీఆర్ సాబ్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన వ్యక్తి (చావూష్) మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు'' అన్న పోస్ట్కు స్పందించిన కేటీఆర్ ''తప్పకుండా కలుస్తాను. చావూష్ గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి'' అని బదులిచ్చాడు. ఎప్పుడో ముప్ఫై ఏండ్ల క్రితం ఆబిడ్స్లో గ్రామర్ స్కూళ్లో తను చదువుకునేటప్పుడు స్కూలు ముందు ఐస్ గోలా అమ్ముకునే సయ్యద్ అలీని మంగళవారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశాడు. సయ్యద్ అలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశాడు. ''ఇంకా ఐస్ గోలా అమ్ముతున్నావా, కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది''? అని వాకబు చేశారు. తనకు ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని, గతేడాదే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని, ఇంకా ఆబిడ్స్ గ్రామర్ స్కూల్ వద్ద ఐస్ గోలాలు అమ్ముతున్నానని సయ్యద్ అలీ బదులిచ్చాడు. సయ్యద్ అలీకి ఉండడానికి నిలువ నీడ కూడా లేదని మాటల్లో తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించి మీకు వెంటనే ఒక గహంతో పాటు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేపిస్తానని మాట ఇచ్చారు.