Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
నిజమాబాద్ జిల్లాలో మిస్సైన బాలుడిని ఫలక్నుమా పోలీసులు తల్లికి అప్పగించారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామబాద్ నిర్మల్ ప్రాంతానికి చెందిన అస్మ కొడుకు షాముద్దీన్. తల్లి అస్మ ఆదివారం వేరే ఊరికి ఫంక్షన్కు వెళ్లింది. సోమవారం కొడుకును కూడా ఫంక్షన్కు రమ్మని చెప్పడంతో కొడుకు షాముద్దీన్ తాను వెళ్లాల్సిన బస్సు ఎక్కకుండా హైదరాబాద్ బస్సు ఎక్కాడు. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాలో షాముద్దీన్ తిరుగుతుండగా అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. వివరాలను సేకరించిన పోలీసులు తల్లి అస్మను పిలపించి కొడుకును అప్పగించారు.