Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మతి చెందిన ఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన శేఖర్ బాబు(50) నగరానికి వచ్చి ఆల్విన్ కాలినిలో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతను ఈ నెల 3న ఆల్విన్ కాలినీలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు, అతని స్నేహితుడు క్రాంతి కుమార్ 108కి సమచారమిచ్చి, సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.