Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావునగర్
హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్నగర్లో రూ. 6 లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్య గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అప్రోజ్ , జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.