Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 47,160 నగదు, 10 సెల్ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-హయత్నగర్
ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది యువకులను ఎల్బీనగర్ ఎస్ఓటీ, స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీ నూలబండాకు చెందిన కిరణ్, సాగర్, ప్రవీణ్, పరమేశ్, సాయి, మనోజ్, మహేందర్, సృష్టి, శ్రీహరి అనే యువకులు పేకాట ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 47,160నగదు, 10సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు.