Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మేడ్చల్ మండలంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో కనిపించిన ప్రేమ జంటకు బలవంతంగా పెండ్లి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వల్లోని సూర్యనగర్ నివాసముండే కంతరెడ్డి జైపాల్రెడ్డి కూతురు సుస్మిత(19) స్థానిక కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
గురువారం తన సమీప బంధువైన రాకేష్తో కలిసి కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కులో ఉండగా మొల్లంగిరి శ్రీహరి చారి, కుంచల ఆనంద్, కనుగాంటి అవినాష్, పిట్ల అశోక్, బార్ల సురేష్ కుమార్, తలపురం చంద్రశేఖర్లు ప్రేమ జంటకు బలవంతంగా పెళ్ళి చేసి ,ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ ఘటనపై సుస్మిత తండ్రి కంతరెడ్డి జైపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు నిందితులపై 76, 342, 354, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయనున్నట్టు ఎసీపీ శ్రీనివాస్ రావు, సీఐ గంగధర్ తెలిపారు.