Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై జయ రామ్ హత్యకేసులో పోలీసులు దర్యాప్తును వేగ వంతం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డితో పాటు హైదరా బాద్కు చెందిన రౌడీషీటర్ నగేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, తాజాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ పేరు వెలుగులోకి వచ్చింది. జయరామ్ హత్యలో జూనియర్ ఆర్టిస్ట్ సూర్య పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమాని స్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డి, శ్రీనివాస్లను కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా బంజారా హిల్స్ పోలీసు స్టేషన్లో గురువారం శిఖా చౌదరి విచారణకు హాజరయ్యారు.ఈ కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్తోపాటు శిఖా చౌదరిని వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్ విచారించారు. దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రాకేశ్ రెడ్డి ఇంటిని గంట పాటు పోలీసులు పరిశీలించారు. రాకేశ్ రెడ్డి ఇంట్లో హత్య జరిగిన విధానాన్ని నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జయరామ్ను రాకేష్రెడ్డి ఇంట్లోనే హత్య చేసినట్టు తేలడంతో కేసు రీ-కన్స్ట్రక్షన్ కోసం రాకేష్రెడ్డి, శ్రీనివాస్లను తీసుకొచ్చిన పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో నిందితుల వాంగ్ములం నమోదు చేశారు. అలాగే రాకేష్ రెడ్డి నివాసం, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. జయరామ్ హత్య కేసులో ఇప్పటికే నిందితుడి నుంచి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆర్థిక లావాదేవీల కోణంలో జరగలేదని తేల్చారు. కేవలం బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్న పథకంతోనే జయరామ్ను ట్రాప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. రాకేష్రెడ్డితో పాటు హైదరాబాద్లోని చింతల్కు చెందిన రౌడీషీటర్ నగేష్ కూడా జయరామ్ హత్యలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అను మానిస్తున్నారు. జయరామ్ను హత్య చేసిన రోజు ఘటనా స్థలంలో నగేష్ ఉండటమే కాకుండా హత్యకు సహరించినట్లు భావిసు ్తన్నారు. ఈ కేసులో రౌడీషీటర్ నగేష్తో పాటు విశాల్ అనే యువకుడి ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరామ్ ముఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది విశాల్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా సినీ జూనియర్ ఆర్టిస్ట్ సూర్య పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు రియల్టర్లతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ను కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.
ఎనిమిది గంటల పాటు శిఖాను విచారణ
జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు విచారించారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డిసిపి శ్రీనివాస్ నేతృత్వంలోని అధికారుల బృందం దాదాపు 8 గంటల పాటు విచారించింది. శిఖా చౌదరి ఆర్థిక లావాదేవీలు, విలాసవంతమైన జీవితం గడపడంపై ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే రాకేష్రెడ్డితో పరిచయం, జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపణలపైనా శిఖాను ప్రశ్నించినట్టు సమాచారం. ఇటు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన శిఖా తనకు తెలిసిన సమాచారాన్ని అధికారులకు అందించానని చెప్పారు. కేసు దర్యాప్తు పూర్తి కానందున అన్ని విషయాలు చెప్పలేనన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారన్నారు.