Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'యాక్షన్ ప్లాన్' మరిచిన అధికారులు
- 545 'అనుమతి లేని' నివేదిక సంగతేంటి..?
- శివారులో ఆగని అనుమతిలేని లేవుట్లు, నిర్మాణాలు
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో నిబంధనలకు విరు ద్ధంగా వెలుస్తున్న అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్కు అధికారులు మంగళం పాడి నట్టు తెలుస్తోంది. అథారిటీ విస్తరిత ప్రాం తంలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న రియల్టర్లపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలకు చెక్పేట్టేందుకు అప్పటి కమిషనర్ జనార్ధన్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించిన విషయం విధితమే. ఈ మేరకు ఏడుగురి అధికారులతో కలిపి నాలుగు ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. ఈ బృందాలు గత నెల జనవరిలో పదిరోజుల పాటు ఏడు జిల్లాలు తిరిగి కొంత మేర ఫలితాలు సాధించాయి.
అయితే ప్రతినెలా మొదటివారంలో డ్రైవ్ ఉంటుందని చెప్పి.. ఫిబ్రవరి నెల గడిచిపోయి పదిరోజులు కావస్తున్నా అధికారులు మాత్రం ఆ ఊసేత్తడం లేదు. ఫలితంగా అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలు యథావిథిగా కొనసాగుతు న్నాయి. కేవలం ఉన్నతాది óకారుల ఆదేశాల మేరకు అప్పటివరకు హడావుడి చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత వాటిని గాలికొదేలేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి- భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్లలోని 70 మండలాల్లో విస్తరించి ఉంది. నగర శివారు ప్రాంతాల్లోని మండల కేంద్రాలను, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కేంద్రంగా చేసుకుని రాత్రి రాత్రికి అనుమతి లేని లేఅవుట్లు పుట్టుకొస్తు న్నాయి. స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో యథేచ్ఛగా అనధికార లేఅవుట్లు, అనుమతి లేని భవనాలు నిర్మిస్తున్నారు. చెరువులు, కుంటలు, చెరువు శిఖం భూమలంటూ తేడా లేకుండా లేఅవుట్లు చేసి సామాన్య ప్రజానీకానికి అంటగడుతున్నారు. దీంతో లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజానీకం చివరకు మోసపోతున్నారు. దీనికితోడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకునేందుకు జోన్ల వారిగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ గత కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందాలు గత నెల జనవరిలో 3-13 తేదీ వరకు నేరుగా గ్రామాలు, మండల కేంద్రాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాల వివరాలను సేకరించాయి. శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ జోన్లలో కలిపి సుమారు 545 అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలు గుర్తించిన అధికారులు నివేదికను సిద్ధం చేశారు. సంబంధిత జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు, డీపీవోలకు పంపించి చర్యలు తీసుకోవాలని అథారిటీ అధికారులు కోరారు. అలాగే అనుమతి లేకుండానే అథారిటీ లోగో వాడుతున్న ఒక రియల్ఎస్టేట్ సంస్థపై హెచ్ఎండీఏ అధికారులు ఏకంగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఇన్ని చేసిన అధికారులు వీటిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అక్రమార్కులకు అదే అవకాశం..
హైదరాబాద్ విశ్వనగర అభివృద్ధి ముఖ్య భూమిక పోషిస్తున్న హెచ్ఎండీలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఇంతటి కీలకమైన సంస్థలో పద్నాగేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేదు. నెలకు ఐదారుగురు రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాది 20మందికిపైగా రిటైర్ అవుతున్నట్టు సమాచారం. దీనికితోడు హెచ్ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదు. సరిగ్గా ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది.
మరోవైపు ప్లానింగ్ అధికారులకు పనిభారం పెరిగింది. క్ష్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణలేమి కారణంగా శివారు ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు, భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇవికాస్త శివారు ప్రాంతాల పట్టణ ప్రణాళికాభివృద్ధికి విఘాతంగా మారుతున్నాయి. మరోవైపు అనుమతి లేని లేఅవుట్ల, నిర్మాణాల ద్వారా హెచ్ఎండీఏ ఖజానాకు గండి పడుతోంది.