Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
కవితానుభవ సారం అంతరంగమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందినీ సిధారెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యంలో విమర్శకు ప్రత్యేక స్థానం ఉందని, ఏనుగు నర్సింహారెడ్డి ఆధునిక కవిత్వంపై విమర్శలు హేతుబద్ధంగా ఉంటాయని ఆయన అన్నారు. రవీంద్రభారతి ప్రాంగణంలోని అకాడమీ కార్యాలయంలో డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఆధునిక కవిత్వంపై రచించిన అంతరంగం విమర్శన సంపుటి ఆవిష్కరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా డాక్టర్ సిధారెడ్డి పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. కవిత్వం, పద్యం, వ్యాసం, సమీక్ష, అనువాదం అన్ని ప్రక్రియలలోనూ ప్రత్యేక ముద్రశైలి నర్సింహారెడ్డిది అన్నారు. ప్రతివారి అంతరంగంలోని అనేక ఆలోచనలు ఉంటా యని వాటిని అక్షరీకరించే వారు కొందరే అన్నారు. భావాలను కవిత్వం ద్వారా వ్యక్తం చేసేందుకు సహృదయత, రసదృష్టి ఉండాలని నర్సింహారెడ్డిలో పుష్కలంగా ఉన్నాయన్నారు. కవి వజ్జెల శివకుమార్ మాట్లాడుతూ నర్సింహారెడ్డి ఆధునిక కవుల సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన భావాలను నిర్మోహమాటంగా ప్రకటించారని చెప్పారు. నర్సింహారెడ్డి తమ సంపుటిని డాక్టర్ నాళేశ్వరం శకరం అంకితమిస్తూ ఎంత ప్రేమగా, ఎంత సహజంగా, ఎంత సరళంగా ఉండవచ్చో లోకానికి తెలుపుతున్న యోగి, లోకం నుంచి నేర్చుకుంటున్న కవి శంకరమని తెలిపారు.