Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటున్న న్యాయవాదుల ఆవాజ్ నేటి 'ఆవాజ్' శీర్షికలో తెలుసుకుందాం.
నవతెలంగాణ - కూకట్పల్లి
బడ్జెట్లో రూ.5 వేల కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి కేటాయిం చాలని, వడ్డీ లేని గృహ రుణాలను మంజూరు చేయాలని, ఎవరైనా న్యాయ వాదులు మృతి చెందితే వారి కుటుంబా నికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించా లని, న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్, లీగల్ సెల్లో బార్ అసోసియేషన్ ప్రవేశం కల్పించా లని, తదితర 10 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బార్ కౌన్సిల్ చైర్మన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు అందజేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్, సభ్యులు పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ వరకు విధుల బహిష్కరించి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మంగళ వారం కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రామ చంద్రం ఆధ్వర్యంలో న్యాయవాదులు కూకట్పల్లి కోర్టు నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీదేవి, కోశాధికారి వెంకటేశం, లైబ్రరీ సెక్రెటరీ పద్మజ, సుశీల, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
ఎవరైనా 65 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారు ప్రమాదవశా త్తూ లేక అనారోగ్యం తో మరణించినట్ల యితే వారి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
- కె.శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి న్యాయవాదులు
ఉచిత వైద్య సేవలందించాలి
న్యాయవాదులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించాలి. దీనికోసం ప్రత్యేకంగా స్పెషల్ హెల్త్ కార్డ్ను కేటాయించి దాని ద్వారా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఎప్పుడైనా, ఎక్కడైనా అన్ని ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చూడాలి. న్యాయ వాదులకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.5 వేల కోట్ల రూపాయలను కేటాయించాలి. రూ.20 లక్షలు ఇన్సూరెన్సు కవరేజ్ వర్తించేలా ఏర్పాట్లు చేయాలి.
- కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే.రామచంద్రం
సొంత కోర్టు భవనాలు ఏర్పాటు చేయాలి
సొంత కోర్టు భవనాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఆ భవనాలలో న్యాయవాదులకు సరి అయిన లైబ్రరీ, మహిళ న్యాయవాదులకు ప్రత్యేక రూమ్ లను కేటాయించాలి. కొత్తగా న్యాయవాద వత్తిని చేపట్టె వారికి ప్రతి నెల 10 వేల రూపాయలు కాలర్ షిప్ను అందించాలి.
- బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి.రాజేష్ కుమార్