Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి సీఈసీ ఆదేశాలు
- మేడ్చల్ కలెక్టర్ బదిలీపై వచ్చే అవకాశం
- రెండు.. మూడు రోజుల్లో భర్తీ అయ్యే ఛాన్స్
నవతెలంగాణ - సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నియామకం ఓ కొలిక్కి వస్తోంది. జిల్లాలో నెల రోజులకు పైగా ఇన్చార్జి పాలనే నడుస్తుంది. కలెక్టర్ రఘునందన్రావు స్టడీ టూర్ నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో జేసీ... ఇన్చార్జి బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే 35 రోజులు గడిచినా ప్రభుత్వం కొత్త కలెక్టర్ను నియామకం చేయలేదు. హైదరాబాద్కు కలెక్టర్ నియామకాన్ని మర్చిపోయినట్టుగా ప్రభుత్వం వ్యవ హరిస్తోంది. ఇదే పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో
కలెక్టర్ నియామకం తప్పనిసరి అవుతోంది.
ఆర్వోగా బాధ్యతలు తప్పనిసరి...
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ ్ఎంసీ కమిషనర్ వ్యవహరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ స్థాయిల్లో ఆర్వోలుగా విధులు నిర్వహిస్తారు. జిల్లాలో ఉన్నదే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు కావడం, రెండింటిలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లా కలెక్టరే రిటర్నింగ్ అధికారిగా (ఆర్వో) స్వయంగా విధులు చేపట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్ నియోజక వర్గానికి కలెక్టర్, సికింద్రాబాద్ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ ఆర్వోగా విధులు నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ నియామకం తప్పనిసరి అవుతోంది.
ప్రభుత్వానికి సీఈసీ అక్షింతలు ...
సార్వత్రిక ఎన్నికల కోసం చీఫ్ ఎలక్షన్ కమిషన్ గత నెలరోజులుగా కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఓటర్ల నమోదు, మార్పులు - చేర్పులు వంటి ప్రక్రియలు ఇప్పటికే పూర్తి చేసింది. అందుకనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తగిన చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాకు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న జీహెచ్ ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఆర్వోలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లు లేరనే విషయాన్ని సీఈసీ గమనిం చింది. ఈ నెల 20వ తేదీ కల్లా ఆ రెండు జిల్లాలకు కల ెక్టర్ల నియామకం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అంతే కాకుండా, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారం భమై చాలా రోజులు అవుతున్నా... ఇంకా కలెక్టర్ల నియా మకం ఎందుకు చేపట్టలేదని నిలదీసినట్టు తెలిసింది.
రెండ్రోజుల్లో భర్తీకి అవకాశం!
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గుగులోతు రవి వ్యవహరిస్తున్నారు. జిల్లాకు కొత్త కలెక్టర్గా ఎవరు రానున్నారనే పేర్లపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్లు విన్పిస్తున్నారు. వీరిలో హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ప్రశాంతి, జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్గా రోనాల్డ్ రోస్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా ఎంవీ రెడ్డిలు పనిచేశారు. హైదరాబాద్ జిల్లాపై వీరందరికీ అవగాహన ఇప్పటికే ఉంది. అయితే, ఈ ముగ్గురిలో అత్యధికంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి యే హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ కల్లా కొత్త కలెక్టర్ వచ్చే వీలుంది.