Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు నేలకేసి కొడితే...ఇంకొకరు సీసతో గొంతు కోసిన వైనం నగరంలో వరుస ఘటలు
- చిన్నారులతో గంట పాటు కాలక్షేపం చేస్తే ఎంత కష్టాన్నైనా మర్చిపోతాం.
- మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఓ సందర్భంలో బుడిబుడి అడుగులు... ముద్దులొలికే మాటలతో అలరించే చిన్నారులు ఏం చేస్తున్నారో... ఎలా ఉన్నారో... అని ఆలోచిస్తారు. కానీ నేడు కొందరు
తల్లిదండ్రులు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. దాంపత్య జీవితంలో ఏ కష్టమొచ్చినా ఆ కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నారు. మరి కొందరు ఆర్థిక లావాదేవీల కారణంగా ఇక బతకలేమని పిల్లలను చంపేస్తున్నారు. కుటుంబ కలహాలు.... ఫైనాన్స్ విభేదాలు... చివరకు వివాహేతర సంబంధానికి
అడ్డుగా ఉన్నారనే కారణంగా పసిహృదయాల్ని దారుణంగా హత్య చేస్తున్నారు.
పాపం.. పసి మొగ్గలు
పగలు, ప్రతీకారాలతో కొందరు చిన్నారులను ఎత్తుకెళ్తుంటే, మరికొందరు ఆర్థిక లావాదేవీలు, జల్సాలకు డబ్బు సంపాదన కోసం అభం శుభం తెలియని చిన్నారులను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తూ కన్నపేగుకు తీరని కష్టాన్ని మిగిలిస్తున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా, చిన్నారులను రక్షించేందుకు ఎన్ని చట్టాలున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల భర్తపై అనుమానంతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ విషాదంలో ఐదేండ్ల కుమార్తె అక్కడికికక్కడే మృతి చెందింది. కుమారుని పరిస్థితి విషమంగా మారింది. కర్నాటక నుంచి హైదరాబాద్కు వచ్చిన సురేష్, సుమ దంపతులు రెండేండ్లుగా మియాపూర్ లక్ష్మినగర్లో నివాసముంటున్నారు. వీరికి హర్షిత(5), హర్ష(5) సంతానం. సురేష్ బాచుపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో ఏవోగా పని చేస్తున్నాడు. అన్యో న్యంగా సాగుతున్న వారి జీవితంలో అనుమానం అనే పదం చేరింది. భర్త తాను పని చేసే కంపెనీలో సహో ద్యోగితో చనువుగా ఉండడం, తరచూ చరవాణిలో సంభాషిస్తుండటంతో దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. భర్తపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిం చింది భార్య. తాను విషం తాగి పిల్లలకూ తాగించింది.
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి భర్తపై అనుమానంతో చిన్నారులను కడతేర్చింది. నగ రంలో కొద్ది నెలలక్రితం జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. హాయిగా నిద్రపోతున్న చిన్న కూతురు(3), టీవీ చూస్తున్న పెద్ద కూతురు(7)ను పగులగొట్టిన సీసాతో గొంతు కోసి అతిదారుణంగా హత్య చేసింది. ఈస్ట్మారెడ్పల్లిలోని టీచర్స్కాలనీలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇలాంటి ఘటనే కొన్ని నెలల క్రితం నగరంలో చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగి మద్యం మత్తులోఉన్న భర్త తమ కుమారున్ని నేలకేసి కొట్లాడు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
మారుతున్న సంస్కృతి, సినిమా, సామాజిక మాధ్యమాల ప్రభావానికి లోనై అనేక మంది తమ నిండు జీవితాలను పాడుచేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులపై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిస్తుంటే, మరికొందరు ఆస్తి కోసం అయిన వారిని దారుణంగా హత్య చేస్తున్నారు. ఇక మరికొందరు వివాహేతర సంబంధాల విషయంలో దారుణాలకు ఒడిగడు తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి హత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.