Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్/ చార్మినార్
నగరంలో ఆకలితో అలమటిస్తున్న పేదల కోసమే ఫీడ ద నీడ్ కార్యక్రమన్ని జీహెచ్ఎంసీ చేపట్టిందని, ఇది సంతోకర విషయమని చార్మినార్ సర్కిల్ డీప్యూటీ కమిషనర్ సరళమ్మ అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అదేశాల మేరకు చార్మినార్ యూనానీ అస్పత్రిలో రోగులకు, రోగుల బంధువులకు ఏఎంహెచ్వోలు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఖాద్రీలతో కలిసి అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫీడ్ ద నీడ్ పథకంలో బాగంగా పిస్తా హౌజ్ యాజమాన్యం సహకరించిందని, ఆ యాజమాన్యాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.