Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చాంద్రాయణగుట్ట
కుల వృత్తులకు సహకరిస్తామంటున్న ప్రభుత్వం మరోపక్క భారాలు మోపుతు మోసాలకు పాల్పడుతుందని, కులవృత్తులపై భారం తగదని బాగ్యనగర విశ్వకర్మ సంక్షేమ సంఘం సలహదారుడు తల్లోజు చెన్నయ్య చారీ అన్నారు. ఆటవీశాఖ జీవో 55ను సవరించాలని పాతబస్తీ చత్రినాక కులవృత్తి దారులు దుకాణాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటవీ శాఖ చట్టాలు వడ్రంగీ పనులు చేసుకునే విశ్వబ్రహ్మణుల పట్ల శాపంగా మారాయన్నారు. చట్టాల పేరుతో విశ్వబ్రహ్మణులను వేధిస్తున్నారని చెప్పారు. జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. వర్క్షాపుల నిర్వహకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. జీవోను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం అద్యక్షులు పాండురంగాచారీ, ప్రధాన కార్యదర్శి శ్యాంచారీ, కోశాధికారి డి.నర్సింహాచారీ, ఎన్.చంద్రమౌళిచారీ, పరిపూర్ణ చారీ, లింగచారీ, వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు